అక్రమ మైనింగ్పై కలెక్టర్కు వినతి
ATP: పీఏబీఆర్ డ్యామ్కు అనుకుని ఉన్న నల్లగుట్ట వద్ద జరుగుతున్న అక్రమ మైనింగ్ను వెంటనే ఆపాలని, మైనింగ్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై. విశ్వేశ్వర రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ను కోరారు. ఈ అక్రమ మైనింగ్ వల్ల డ్యామ్కు ప్రమాదం ఏర్పడుతుందని, దీని వెనుక అధికార పార్టీ అండ ఉందని ఆయన ఆరోపించారు.