ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయాలి: కలెక్టర్

JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటుకలు, ఇసుక, సిమెంట్ ధరలు, నాణ్యత వివరాలను తెలుసుకుని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయాలని సూచించారు.