విలేకరికి పంచాయతీ కార్యదర్శి బెదిరింపులు
KMR: గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిపై బుధవారం ఎంపీడీవో రాజేశ్వరకు ఫిర్యాదు చేశారు. సమయపాలన పాటించడంలేదని, విధుల్లో బాధ్యతరహితం వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వార్తను రాసిన విలేఖరికి ఫోన్ చేసిన సదురు కార్యదర్శి గురువారం బెదిరింపులకు దిగారని, తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.