మేడికుంట గుట్టలో పెద్దపులి సంచారం..
MHBD: కొత్తగూడ మండలం, పోలారం సమీపంలోని మేడి కుంటలో చేపల వేటకు వెళ్లిన యువకుడు వినోద్ శనివారం పెద్దపులిని గమనించాడు. ఈ సంఘటనకు స్పందించి గ్రామస్తులకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులు భయంతో పరుగు తీశారు. అటవీ శాఖ అధికారులు ఈ సంఘటనపై అప్రమత్తతను సూచిస్తూ, గ్రామస్థులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.