నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఏసీపీ
NTR: బార్లు, మద్యం షాపులు, రెస్టారెంట్లు ప్రభుత్వ నిబంధనలు, సమయపాలన పాటించాలని ACP దామోదర్ తెలిపారు. విజయవాడ సెంట్రల్ జోన్ పరిధిలోని బార్ రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. బార్ల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. బార్లు వద్ద గొడవలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.