డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని చంపిన కొడుకు
SRD: కోహీర్ మండలం బడంపేట గ్రామంలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు బాలరాజ్ తల్లిని హత్య చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. డబ్బుల కోసం 3 రోజుల నుంచి తల్లి పద్మమ్మ (52)తో గొడవ పడుతున్నాడని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంలో తల్లిని గోడకు కొట్టడంతో స్పాట్లోనే మృతి చెందిందని తెలిపారు. శనివారం బాల్ రాజ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామన్నారు.