ఖరీదైన ఇల్లు కొన్న శిఖర్ ధావన్

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. గురుగ్రామ్ DLF 5, సెక్టార్ 54, గోల్ఫ్ కోర్స్ రోడ్లోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ధావన్ ఫ్లాట్ కొన్నట్లు సమాచారం. దీని ధర రూ.65.61 కోట్లని తెలుస్తోంది. దీనికి స్టాంపు డ్యూటీగా మరో రూ.3.28 కోట్లు చెల్లించాడు. కాగా, భారత్ తరఫున 167 వన్డేలు ఆడిన ధావన్.. 6793 రన్స్ చేశాడు.