మీనాక్షితో రాములమ్మ, అద్దంకి భేటీ

TG: మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షిని ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి కలిశారు. బీసీ కోటాలో తనకు అవకాశం కల్పించాలంటూ విజయశాంతి 15 నిమిషాల పాటు మీనాక్షితో చర్చించారు. అనంతరం అందుబాటులో ఉన్న ఎంపీలతోనూ మీనాక్షి సమావేశం నిర్వహించి పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.