రైతులకు భూసార పరీక్షలపై అవగాహన
AKP: రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని ఎస్. రాయవరం మండలం టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం సూచించారు.సైతారుపేటలో ఏవోలు సౌజన్య విజేత ఆధ్వర్యంలో ఇవాళ భూసార పరీక్షలు, వాటి ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు తమ పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేయించి, ఫలితాల ఆధారంగా ఎరువుల వినియోగం చేపట్టాలని శాస్త్రవేత్త శిరీష అన్నారు.