వారాంత సంతల ద్వారా రూ. 3.24 లక్షల ఆదాయం
అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన వారాంత సంతల ద్వారా మొత్తం రూ. 3,24,950 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకల సంతలో రూ.1,91,650, ఆదివారం నిర్వహించిన పశువుల సంతలో రూ.1,33,300 ఆదాయం లభించినట్లు మార్కెట్ యార్డు అధికారులు వెల్లడించారు.