ఎమ్మెల్యేను కలసిన డీఎల్డీవో

CTR: పలమనేరు MLA అమరనాథ రెడ్డిని DLDO కే. రామచంద్ర శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతి ఎంపీడీవోగా పని చేస్తున్న ఈయన ప్రమోషన్పై డీఎల్డివోగా జిల్లాకు బదిలీ పై వచ్చారు. దీంతో మొదటి సారి నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్ష కోసం వచ్చిన ఆయన స్థానిక TDP కార్యాలయంలో ఎమ్మెల్యేకు పుష్ప గుచ్చం అందించి మర్యాద పూర్వకంగా కలిశారు.