మ్యాట్రిమోనిలో పరిచయం..రూ. 1.30 కోట్లు స్వాహా
HYD: మ్యాట్రిమోనిలో పరిచయమైన కేటుగాడు సాఫ్ట్వేర్ను నమ్మించి రూ.1.30 కోట్లు వసూలు చేసిన ఘటన సైబరాబాద్లో వెలుగుచూసింది. 2023లో కొలికలపూడి నాగేంద్రబాబు అనే వ్యక్తి బాధితురాలికి పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆర్థిక ఇబ్బందుల నెపంతో భారీగా డబ్బు తీసుకున్నాడు. చివరకు నిందితుడికి పెళ్లైనట్లు తెలిసి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.