నూతన రాములోరి ఆలయ ప్రారంభంలో MLA
CTR: పుంగనూరు మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతాసమేత కోదండరామస్వామి ఆలయ ప్రారంభపూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత ఆలయంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.