BREAKING: 30 మంది ఉగ్రవాదులు హతం!

భారత ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో భాగంగా 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. బహావల్పూర్లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ దాడి చేసింది. దీంతో అక్కడ 30 మంది టెర్రరిస్టులు హతమైనట్లు సమాచారం. ఇదే విషయాన్ని పాక్ మీడియాలో వెల్లడించినట్లు తెలుస్తోంది.