VIDEO: మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం

VIDEO: మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం

NLG: జిల్లా పరిధిలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద 'విహారి' ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకుని బయటికి దూకారు. తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇటీవల కర్నూలులో కావేరి బస్సు దగ్ధమై 19 మంది సజీవ దహనమయ్యారు.