ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు కంటి పరీక్షలు
MDK: రెండవ విడత అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ ఆర్టీసీ డిపోలో కంటి పరీక్షల శిబిరాన్ని అదనపు ఎస్పీ మహేందర్, ఆర్టీసీ డీఎం సురేఖ, సీఐ మహేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు. నియమాలను పాటించడంతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.