'ఆరు నెలల్లో లబ్బర్తికి మంచినీరు'
ASR: రాజవొమ్మంగి మండలం లబ్బర్తిలో జల్ జీవన్ మిషన్ కింద రూ.69 లక్షలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి ట్యాంక్ పనులకు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి శంకుస్థాపన చేశారు. కేవలం 6 నెలల్లో పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.