హౌస్ అరెస్ట్‌లపై వార్తలు అవాస్తవం: డీఎస్పీ

హౌస్ అరెస్ట్‌లపై వార్తలు అవాస్తవం: డీఎస్పీ

కడపలో హౌస్ అరెస్ట్‌లు జరిగాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఇ. బాలస్వామి రెడ్డి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముందస్తు చర్యలే తీసుకున్నామని చెప్పారు. అంజాద్ బాషా, నిత్యానంద రెడ్డి కోర్టుకు హాజరయ్యారని, ఎవరినీ నిర్బంధించలేదని స్పష్టం చేశారు. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.