శతాధిక గ్రంథ రచనలు.. సిమ్మన్న సొంతం

శతాధిక గ్రంథ రచనలు.. సిమ్మన్న సొంతం

 VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత ఆచార్య వెలమల సిమ్మన్నకు సోమవారం ఘన సన్మానం నిర్వహించారు. తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు అధ్యాపకులు సిమ్మన్నను “నడిచే గ్రంథాలయం”గా కొనియాడారు. శతాధిక గ్రంథ రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని ప్రశంసించారు.