లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: SI
MLG: జిల్లా కోర్టులో ఈ నెల 28న జరగనున్న లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వెంకటాపూర్ SI చల్లా రాజు తెలిపారు. ప్రమాదాలు, చీటింగ్, వివాహ వివాదాలు, దొంగతనాలు వంటి రాజీకి అనువైన కేసులను లోక్ అదాలత్ ద్వారా స్నేహపూర్వకంగా, ఖర్చులు లేకుండా, శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు పోలీస్ స్టేషను సంప్రదించాలన్నారు.