అన్నం పరబ్రహ్మ స్వరూపం: మండవ

NTR: నందిగామ రైతు బజార్లో అన్నా క్యాంటీన్లో మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి సోమవారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి పనుల మీద వచ్చిన వారికి అన్న క్యాంటీన్ ఆకలి తీర్చే అమ్మలాగా దోహదపడుతుందని పేర్కొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్న ప్రసాదాన్ని ఎవరు వృధా చేయకుండా తగినంత తీసుకోవాలని సూచించారు.