'మీకోసం' కార్యక్రమానికి 95 ఫిర్యాదులు
ASR: పాడేరు ఐటీడీఏలో ఇవాళ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ 'మీకోసం' కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టర్, అధికారులు వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.