బెల్లంపల్లి కోర్టు ఏజీపీగా సీహెచ్ శ్రీనివాస్
MNCL: బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేస్తున్న చొప్పదండి శ్రీనివాస్ను ప్రభుత్వం పర్మనెంట్గా అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను జారీ చేసింది. బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏజీపీగా నియమితులైన ఆయనను న్యాయమూర్తి జె ముఖేష్, సీనియర్ న్యాయవాదులు సన్మానించారు.