జగన్ పరదాల చాటున తిరిగేవారు: మంత్రి కొల్లు

జగన్ పరదాల చాటున తిరిగేవారు: మంత్రి కొల్లు

AP: జగన్ పరదాల చాటున తిరిగేవారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఎరువుల పేరుతో జగన్ రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. అవసరం మేరకు యూరియా ఇస్తున్నట్లు తెలిపారు. జగన్ కావాలనే జనాన్ని రెచ్చగొడుతున్నారని.. మెడికల్ కాలేజీలపై నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము సంయమనంతో ఉన్నాం కాబట్టే వైసీపీ నేతలు ఇంకా రోడ్లపై తిరుగుతున్నారని పేర్కొన్నారు.