మల్లన్నను దర్శించుకున్న సైబరాబాద్ ఏసీపీ

మల్లన్నను దర్శించుకున్న సైబరాబాద్ ఏసీపీ

SDPT: ప్రసిద్ధ కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సైబరాబాద్ ఏసీపీ బి.శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారి సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.