కాలువ నీరే తాగునీరు.. గ్రామస్తుల దుస్థితి
ASR: పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ ఎర్రబయలు గ్రామంలో గిరిజనులు 2019 నుంచి తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాగునీటి కాలువలలోని కలుషిత నీటిని తాగుతూ అనారోగ్యాలకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బోర్వెల్ మంజూరు చేసినప్పటికీ RWS అధికారులు పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.