ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు

ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు

కృష్టా: రాష్ట్రంలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం (ఈసి) బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆదివారం ఈసి ఆదేశాలిచ్చింది. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాను బదిలీ చేసింది. ప్రస్తుత విధుల నుంచి వీరిని తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.