అమరావతి బిల్లుపై జనసేన సంబరాలకు పిలుపు: మంత్రి
GNTR: జనసేన నాయకులతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం దిశగా ఉందని తెలిపారు. బిల్లు ఆమోదం అయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా దీపాలు వెలిగించి సంబరాలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలపాలని సూచించారు.