మృతురాలి చిత్రపటానికి మాజీ మంత్రి నివాళి
MHBD: తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దీకొండ బిక్షపతి మాతృమూర్తి దీకొండ బుచ్చమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మృతురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.