పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడు అరెస్టు

VZM: ఎస్ కోట మండలం చామలాపల్లిలో బుధవారం రాత్రి ప్రసాద్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన మురళి కత్తితో దాడి చేసి హత్య చేయడం తెలిసిందే. అప్పటినుండి పరారీలో ఉన్న మురళి శుక్రవారం తన బైక్ పై ధర్మవరం వెళ్తున్న క్రమంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుండి కత్తి, బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ఎస్ఐ తెలిపారు.