విశేష అలంకరణలో దర్శనం ఇస్తున్న గంగమ్మ

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సుస్మిత్ సాయి అమ్మవారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించి పసుపు, కుంకుమతో ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం కావడంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు.