VIDEO: సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం
HYD: సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్ప్రెస్ ఇంజన్ చక్రం విరిగిపోవడంతో ఉప్పల్ సమీపంలోని మడిపల్లి వద్ద రైలు నిలిచిపోయింది. సుమారు నాలుగు గంటల పాటు రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే అధికారులు మరమ్మతుల అనంతరం వేరే ఇంజన్తో రైలును తరలించారు. చిన్న సమస్య పరిష్కారానికి ఇంత జాప్యం చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.