ఎస్‌యూ పరిధిలో ఈనెల 23 నుంచి LLM పరీక్షలు

ఎస్‌యూ పరిధిలో ఈనెల 23 నుంచి LLM పరీక్షలు

KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్ఎల్ఎం (పీజీ) మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. సురేశ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.