ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన.. మంత్రి
BHPL: మహిళలు ఆర్థికంగా స్వశక్తిని సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ సబ్-డివిజన్ పరిధిలోని 850 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. శిక్షణ పూర్తయ్యాక స్థానికంగా గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.