బస్సు, బైక్ ఢీ.. యువకుడు స్పాట్ డెడ్
ADB: ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూరు గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొల్కె సంతోష్ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. దన్వే సంజీవ్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో రిమ్స్కు తరలించారు. ఉట్నూరు డిపో బస్సు గుంతలను తప్పిస్తూ వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూరు సీఐ మడావి ప్రసాద్ తెలిపారు.