బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవు: సీఐ

బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవు: సీఐ

KRNL: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జూద కార్యకలాపాలపై దేవనకొండ పోలీసులు కఠిన నిఘా ఏర్పాటు చేశారు. గురువారం సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఐపీఎల్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ రమ్మీ, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.