గుండెపోటుతో యువ కార్పెంటర్ మృతి

గుండెపోటుతో యువ కార్పెంటర్ మృతి

MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన కమ్మరి ప్రసాద్ చారి (28) జడ్చర్లలో కార్పెంటర్ పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. పనిలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.హోలీ పండుగ పూట యువకుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.