విఘ్నేశ్వరుని ఆలయానికి రూ. 2 లక్షల ఆదాయం

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 2,17,102 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 375 మంది స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అలాగే, 16 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలోపాల్గొనగా.. 2208 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.