ప్రజల అర్జీలను స్వీకరించిన మంత్రి

ప్రజల అర్జీలను స్వీకరించిన మంత్రి

NDL: ప్రజల సమస్యలను సాధ్యమైనంతవరకు త్వరగా పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.