నేడు ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం
SKLM: గ్రామ పంచాయతీల్లో థీమ్ - 5, క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్లపై శిక్షణ కార్యక్రమాన్ని కవిటి MPDO కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో త్రినాథ్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. సర్పంచులు, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.