రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు

AP: తిరుమలలో రేపటి నుంచి 8వ తేదీ వరకు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు నిర్వహించనున్నారు. టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని సుందరంగా అలంకరించారు. తొలి రోజు మలయప్ప స్వామివారు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై ఊరేగుతారు. పరిణయోత్సవాల సందర్భంగా ఈ మూడు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.