ఇరాన్పై భీకర దాడులు.. 13 మంది మృతి
ఇరాన్పై తెల్లవారుజామున భీకర వైమానిక దాడులు జరిగాయి. బహారెస్థాన్లోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో 13 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే, టెహ్రాన్లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీపైనా దాడులు జరిగినట్లు తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్లు ఈ దాడులపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.