మూడు సార్లు విఫలం.. నాలుగోసారి విజయం
VSP: మూడుసార్లు విఫలమైనా నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రయత్నించిన జిల్లాకు చెందిన గుమ్మల శ్వేత సివిల్స్ పరీక్షలో 573వ ర్యాంకు సాధించారు. నగరంలోని కణితి అంబేద్కర్ కాలనీకి చెందిన ఆమె స్వస్థలం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం మేడిచర్ల గ్రామం. తండ్రి రాజబాబు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగి కాగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. ఈ మేరకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.