మడకశిరలో పర్యటించిన ఎమ్మెల్యే రాజు
సత్యసాయి: మడకశిరలోని పలు వార్డుల్లో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. సీసీ రోడ్లు నిర్మాణం, తాగునీటి సరఫరా మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.