మంత్రిని కలిసిన భువనగిరి ఎమ్మెల్యే

యాదాద్రి: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ఆర్&బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జూలూరు - రుద్రవెల్లి హైలెవల్ బ్రిడ్జి గత 12ఏల్లుగా పెండింగ్లో ఉందని, పాత కాంట్రాక్టర్కు టెండర్ రద్దు చేసి కొత్త ఏజెన్సీ ద్వారా నిధులు కేటాయించి పనులు ప్రారంబించాలని మంత్రిని కోరారు.