ప్రమాదకరమైన మూల మలుపు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో మూల మలుపు ప్రమాదకరంగా ఉండి ప్రమాద సూచికలు లేక పోవటం వల్ల ఇటీవల భారీ వాహనాలు ప్రమాదానికి గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్స్ సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతన్నారు.