చంద్రన్న పాలనలో విద్యకు ప్రాధాన్యం: MLA
CTR: CM చంద్రబాబు సారధ్యంలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించడంతో పాటు డ్రగ్స్ నిర్మూలనపై కఠినంగా వ్యవహరిస్తోందని పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి తెలిపారు. పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఎమ్మెల్యే శుక్రవారం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కళాశాల ప్రాంగణానికి అవసరమైన త్రాగునీటి బోరుకు నూతన మోటర్ను మంజూరు చేస్తున్నట్లు వారు హామీ ఇచ్చారు.