టర్కీ అధ్యక్షుడితో పాక్ ప్రధాని భేటీ

టర్కీ అధ్యక్షుడితో పాక్ ప్రధాని భేటీ

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో పాక్ ప్రధాని షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టర్కీ అధ్యక్షుడికి షరీఫ్ కృతజ్ఞతలు చెప్పారు. భారత్‌తో ఉద్రిక్తతల వేళ తమకు పూర్తి మద్దతు పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ తమ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఇంధనం, వాణిజ్యం, రవాణా, రక్షణ రంగాల్లో ఇరు దేశాల సహకారం మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.