విద్యాసంస్థల సమాఖ్య కీలక నిర్ణయం
TG: ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 8న హైదరాబాద్లో కాలేజీల సిబ్బందితో సమావేశం, 11న 10 లక్షల మంది విద్యార్థులతో సభ నిర్వహించనున్నట్లు పేర్కొంది. తమ డిమాండ్స్ను నెరవేర్చేవరకు బంద్ జరుగుతుందని వెల్లడించింది.