ఉమ్మడి జిల్లా నుంచే ఇద్దరు రాజ్యసభ సభ్యులు

ఉమ్మడి జిల్లా నుంచే ఇద్దరు రాజ్యసభ సభ్యులు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాజకీయంగా అరుదైన గుర్తింపు లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వేముల నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఖరారు కావడంతో జిల్లాకు కేంద్ర స్థాయిలో ప్రాతినిధ్యం మరింత పెరిగింది. ఇప్పటికే వద్దిరాజు రవిచంద్ర BRS తరఫున 2022 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఒకే జిల్లాలో చెందిన వారు ఎంపిక కావడంలో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.